నరసాపురం స్థానం నుంచే పోటీ చేస్తా – రఘురామ

-

 

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి కల కల్లే అవుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. నరసాపురం స్థానం నుంచే రానున్న ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. దరువు, పిడి టీవీ, సాక్షి మీడియా, నీలి చానల్స్ ఎన్ని జిమ్మిక్కులు చేసి, కుట్రలను పన్ని తనను తప్పించే ప్రయత్నాలు చేసినా తాను నరసాపురం లోక్ సభ స్థానం నుంచే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని పునరుద్ఘాటించారు.

తాను ప్రజలలో నుంచి వచ్చిన నాయకుడినని… ప్రజాభిమానం కలిగిన నాయకుడినని… జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన సొంత మీడియా, నీలి చానల్స్, డబ్బా వెబ్సైట్స్, బీజేపీ ముసుగులో ఉన్న వైకాపా నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తనను ఎవరు ఏమీ చేయలేరని, ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి గారు అనుకున్నదే జరిగితే, ప్రజలు ఉన్నారని, అయినా మీ కాసులకు అమ్ముడుపోయే నాయకులు ఎవరు కూడా కూటమిలో లేరని తెలుసుకుంటే మంచిదని అన్నారు. అయినా మీ లుచ్చా ప్రయత్నాలను మీరు చేస్తూనే ఉన్నారని, ఈ ప్రయత్నంలో మీరు ఖచ్చితంగా ఓడిపోతారు గుర్తుంచుకో అంటూ జగన్ మోహన్ రెడ్డి గారిని రఘురామకృష్ణ రాజు గారు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news