రెడ్డి భవనాన్ని నిర్మించలేని.. ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డిది – రఘురామ

-

రెడ్డి భవనాన్ని నిర్మించలేని ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డిది అంటూ వైసీపీ ఎంపీ రఘురామ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పది మందికి వెన్ను దన్నుగా నిలిచే రెడ్డి సామాజిక వర్గానికి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీరని అన్యాయం జరిగిందని ఆ సామాజిక వర్గ నేతలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు రఘురామకృష్ణ రాజు.

ఇతరుల కష్టాలను తీర్చే రెడ్డి సామాజిక వర్గానికి తమ ప్రభుత్వం వల్ల కష్టం వచ్చిందని చెబితే, వారికి అండగా ఉంటామని ధైర్యాన్ని భరోసాను ఇచ్చిన నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, శభాష్… నారా లోకేష్, ఇది మామూలు విషయం కాదు అని అన్నారు. కడప జిల్లా బాగోగులు చూసే రెడ్డి సామాజిక వర్గం తమ ప్రభుత్వం వల్ల కష్టపడుతుంటే అండగా ఉంటామని హామీ ఇచ్చిన లోకేష్ గారి తెగువను అభినందించకుండా ఉండలేకపోతున్నానని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నా, చేతలు గడప దాటడం లేదని, జిల్లాలో రెడ్డి భవనం నిర్మిస్తామని చెప్పి హడావిడి చేశారే తప్పితే, అది నిర్మించింది లేదని జగన్ మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గ నేతలు విమర్శలు గుప్పించారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version