సీఎం జగన్ కు వైఎస్‌ భారతి తప్ప.. ఏ మహిళా ఓటు వేయరు – రఘురామ

-

రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్‌ భారతి తప్ప మరో మహిళ ఓటు వేయరని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అంత దరిద్రంగా తమ పార్టీ పరిస్థితి ఉన్నదని చెప్పారు. కేవలం 370 కోట్ల అవినీతి ఆరోపణలకే జైల్లో పెట్టాలంటున్న జగన్ మోహన్ రెడ్డి గారు తనని తానే విమర్శించుకుంటున్నారన్న విషయాన్ని విస్మరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

43 వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలపై సాక్ష్యాధారాలతో అభియోగాలు మోపితే కోర్టుకు వెళ్లకుండా జగన్ మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎన్నడూ గడప దాటని మహిళలు కూడా రోడ్డు ఎక్కుతున్నారని, గతంలో జగన్ మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసినప్పుడు ఆయన తల్లి, చెల్లి తప్పితే మరొక మహిళ రోడ్డు ఎక్కిన దాఖలాలు లేవని, చివరకు జగన్ మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారు కూడా సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారాలను చూసుకున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news