రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకి కుమ్ముడే కుమ్ముడు – జోగి రమేష్

-

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకి కుమ్ముడే కుమ్ముడని…2024లో చరిత్ర సృష్టించబోతున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు జోగి రమేష్ స్పష్టం చేశారు. 151 పైచిలుకు స్థానాల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మ్యానిపెస్టోలో చెప్పిన హామీలను 95% అమలు చేసిన సీఎం జగన్ మాత్రమేనని… రేపటి ఎన్నికల్లో మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితోనే కాదన్నారు.

దత్త పుత్రుడు, ఎల్లో మీడియాతో కూడా యుద్థం చేయాలి…జగన్ మోహన్ రెడ్డి పై రోజూ విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనలో ప్రజలకు ఏం చెబుతావు చంద్రబాబు ? అని ఫైర్ అయ్యారు.

14 ఏళ్లు సీఎంగా చేసి ప్రజల కోసం ఒక్క మంచి పథకమైనా పెట్టావా ? సామాజిక న్యాయంలో మాతో పోటీ పడగల సత్తా చంద్రబాబుకి ఉందా ? అని నిలదీశారు. మహానాడులో సామాజిక న్యాయం పై చంద్రబాబు ఒక్క తీర్మానమైనా చేేయగలిగాడా?ఎంతమంది కలిసి వచ్చినా జగన్ మోహన్ రెడ్డిని ఇంచు కూడా కదల్చలేరని మండిపడ్డారు జోగి రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news