ఏపీలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు‌ సిద్దం – సోము వీర్రాజు

-

అమరావతి: ఏపీలో అభివృద్ధిపై టిడిపి – వైసిపిలతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఏపీ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ‌ఎంతో సహకారించిందన్నారు. తొమ్మిదేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఎంతో‌ చెప్పాలన్నారు. జగన్ నాలుగేళ్ల‌ పాలనపై ‌ఆర్భాటంగా‌ ప్రచారం చేస్తున్నారని అన్నారు సోము వీర్రాజు. కేంద్రం ఏమిచ్చింది..? రాష్ట్ర ప్రభుత్వం ఏమి‌చేసింది..? అన్నదానిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

ఏపీ ఎలా తిరోగమనం పట్టిందో మేం చెబుతామన్నారు. రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో‌‌ జాబితా‌ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మూడేళ్లు‌‌ అసలు పట్టించుకోని జగన్ విశాఖలో‌ ఏదో సదస్సు పెట్టి హడావుడి‌ చేశారని ఆరోపించారు. కేంద్రం చేపట్టే‌ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ‌స్థలాలు ఇవ్వడం లేదన్నారు సోము వీర్రాజు. ఏపీ మీదుగా మూడు పారిశ్రామిక కారిడార్లు‌ వెళుతున్నాయని.. వీటిపై‌ ఏనాడైనా జగన్ సమీక్షించారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధిపై జగన్ ప్రభుత్వం వద్ద బ్లూ ఫ్రింట్ ఏముంది..? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news