మంత్రి జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో బూడిద అమ్ముకుంటారు – ఎమ్మెల్సీ అనురాధ

-

అమరావతి: వైసిపి నాయకుల పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ. నేడు అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీకి మైండ్ బ్లాంక్ అయిందన్నారు. మంత్రులకు శాఖలపై అవగాహన లేదు కానీ టీడీపీ మేనిఫెస్టోపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మేనిఫెస్టోని ప్రజలు ఎప్పుడో టిష్యూ పేపరులా చించేశారని అన్నారు. టీడీపీ మేనిఫెస్టో పేదవాడి గుండెల్లో ఉందన్నారు అనురాధ.

మంత్రి అంబటికి పోలవరం గేట్లు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కోట్లాది అక్రమ సంపాదన చేశారని ఆరోపించారు. మంత్రి జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో బూడిద అమ్ముకుంటారని ఏద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రికి కోర్టులో ఫైల్స్ దొంగతనం చేయడం మాత్రమే తెలుసని విమర్శించారు అనురాధ. ఇక మంత్రి మేరుగ నాగార్జున వచ్చే ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుంచి కనుమరుగవటం ఖాయమన్నారు. ఒక ఛాన్స్ అని జనం కొలుకోలేకుండా సీఎం జగన్ చేశారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news