కర్నూలులో రోడ్డు ప్రమాదం…మెడికల్ విద్యార్థి మృతి…!

-

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు మెడికల్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ఢీకొని మెడికల్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడు తిరుపతి కి చెందిన తేజేశ్వర్ రెడ్డి గా గుర్తించారు పోలీసులు. కర్నూలు మెడికల్ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్నాడు మృతుడు తేజేశ్వర్ రెడ్డి.

Road accident in Kurnool Medical student killed

ప్రస్తుతం రాజవిహార్ సర్కిల్ లోని మెడికల్ మేన్స్ హాస్టల్లో ఉంటున్నాడు తేజేశ్వర్ రెడ్డి. అయితే… హాస్టల్ నుంచి కాలేజీ రీడింగ్ రూంలో చదువుకునేందుకు బైక్ పై వెళ్తుండగా బస్సు ఢీకొట్టింది. దీంతో మెడికల్ విద్యార్థి తేజేశ్వర్ రెడ్డి మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news