జగన్ కారణంగా అమరావతి నాశనం ?

-

రానున్న ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయినా అమరావతి నాశనం అయిపోవాలన్నదే తన లక్ష్యం అన్నట్లుగా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దరిద్రపు మానసిక స్థితితో వ్యవహరిస్తుందని రఘురామకృష్ణ రాజు గారు మండిపడ్డారు. అమరావతిలో కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారనే అక్కసుతోనే ఈ విధంగా వ్యవహరిస్తుండగా, అక్కడ ఎస్సీ, బీసీలతో పాటు రెడ్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విస్మరిస్తోందని, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిందని తెలిపారు.

మిగతా వారికి లేఅవుట్ వేసి అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించడంలో కాసింత ఆలస్యం జరిగిందని, ఇంతలో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతిలో రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయలేదు సరి కదా, వారికి కనీసం అప్పగించలేదని అన్నారు. తమకు కేటాయించిన ప్లాట్ లను విక్రయించుకోవడానికి వీలుగా నిషేధాన్ని ఎత్తివేయాలని రైతుల కోరితే… మేము ప్లాట్లు మరొక చోట ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేస్తామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అభివృద్ధి జోన్లలో రైతులకు ప్లాట్లు ఇచ్చారని, అక్కడ నుంచి రైతులకు ఇచ్చిన ప్లాట్లను తొలగిస్తే తప్పితే, జోన్ మొత్తాన్ని సర్వనాశనం చేయడం వీలు కాదనే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటువంటి కండిషన్లను పెడుతోందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news