కేజీఎఫ్, బాహుబలి కంటే ఎక్కువగా లోకేష్‌ పాదయాత్ర హిట్ అవుతుంది !

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజోలు నుంచి ప్రారంభించిన రెండవ దఫా యువ గళం పాదయాత్ర ప్రజాగళంగా మారనుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. కేజీఎఫ్ 1 కంటే 2, బాహుబలి 1 కంటే 2 సూపర్, డూపర్ హిట్ అయినట్లు యువ గళం 2 కూడా హిట్ అవుతుందని తెలిపారు. ప్రజల గళంగా మారనున్న యువ గళం శబ్దానికి పాలకపక్షం పునాదులు కదిలి, కూలిపోయే పరిస్థితులు ఎంతో దూరంలో లేదన్నది స్పష్టం అవుతుందన్నారు.

RRR Comments on nara lokesh

నారా లోకేష్ గారి ప్రసంగానికి ప్రజల నుంచి చక్కటి స్పందన లభించింది అన్నారు. బస్సు యాత్ర – తుస్సు యాత్రలో, జగన్ మోహన్ రెడ్డి గారి సభలకు బలవంతంగా తరలించినప్పుడు ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్లు ప్రజలు ఎదురు చూసేవారని, కానీ లోకేష్ గారి యువ గళం పాదయాత్ర సభలో మాత్రం ప్రజల నుంచి చక్కటి ప్రతిస్పందన లభించిందన్నారు. నారా లోకేష్ గారు చేపడుతున్న యువ గళం పాదయాత్ర విశాఖపట్నం వరకు కొనసాగనుందని అన్నారు. విశాఖలో డిసెంబర్ 8వ తేదీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి దంపతులు కొత్త ఇంట్లో పాలు పొంగించనున్నారని, దీనితో విశాఖకు భూకంపం రావడం ఖాయమని స్థానికులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news