భీమవరంలో పవన్ కళ్యాణ్ 50 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయం – రఘురామ

-

రానున్న ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 50 వేల ఓట్ల మెజారిటీతో అద్వితీయమైన విజయాన్ని సాధిస్తారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు ధీమా వ్యక్తం చేశారు. మూడేళ్లకు మించి ఒక్కొక్క భార్యతో వైవాహిక జీవితాన్ని గడప లేని పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తారా అంటూ భీమవరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

పవన్ కళ్యాణ్ గారి వివాహాలకు, ఓట్లకు సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు ఆయన భావ దారిద్ర్యాన్ని, దివాళా కోరుతనాన్ని తెలియజేస్తోందని రఘురామకృష్ణ రాజు గారు విమర్శించారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని నరసాపురం ఎంపీగా, రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థిగా తాను ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తున్నానని అన్నారు. తాను గుండెల మీద చెయ్యి వేసుకుని చెబుతున్నానని, పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరుపాళ్ళు విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news