వివేకా హత్య కేసులో 48 గంటల్లో మరో అరెస్ట్ !

-

ముఖ్యమంత్రి గారు అడ్డుగోడలా నిలిచినప్పటికీ, వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులను ఆధారాలు లేకుండా అరెస్టు చేసేందుకు సీబీఐ ముందుకు వెళ్లే అవకాశం లేదని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వచ్చే 48 గంటల్లో మరొక కీలక అరెస్ట్ ఉంటుందేమో…అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రఘు రామకృష్ణ రాజు.

ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత హు కిల్డ్ బాబాయ్ అనే వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా తీస్తే బాగుంటుందని, వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిజదోషులను పట్టించే వరకు డాక్టర్ సునీత గారు అవిశ్రాంత పోరాటం చేయాలని, ఇంకా పట్టుదలతో ముందుకు వెళ్లి తండ్రి రుణం తీర్చుకోవాలని అన్నారు. సునీత గారు చేస్తున్న పోరాటం మహిళా లోకానికే ఆదర్శమని, ఆంధ్ర ప్రజలు, ప్రజాస్వామ్య వాదుల తరపున సునీత గారికి ఆమె భర్త గారికి అభినందనలు తెలియజేస్తున్నట్లు రఘురామకృష్ణ రాజు గారు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news