కృష్ణాజిల్లాలో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు…50 మంది ప్రయాణికులు !

-

ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకా వారి పాలెం వద్ద అదుపుతప్పి పంట పొలాలలోకి వెళ్లి ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది. చల్లపల్లి నుంచి విజయవాడ వెళ్తుండగా మేకా వారి పాలెం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టినప్పటికీ ప్రయాణికులందరూ సురక్షితంగా బయట పడ్డారు. ఆ ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానికులు గుర్తించారు.

RTC bus overturned in Krishna district

ఇక ఈ ప్రమాదంపై వెంటనే స్పందించి బస్సులో వారిని బయటకు లాగి పోలీస్ వారికి సమాచారం అందించారు స్థానికులు. అటు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు పోలీసులు. బస్సు ప్రమాదంలో చిన్న చిన్న గాయలతో బయటపడ్డారు ప్రయాణికులు. ప్రయాణికులందరూ సురక్షితం కావటంతో అధికారులు రిలాక్స్‌ అయ్యారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news