ఇవాళ రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధుల జమ..53.53 లక్షల మందికి లబ్ది

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రైతులకు శుభవార్త. సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనకు పయనం కానున్నారు. ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌.

More Changes in YSR Free Crop Insurance Scheme
Rythu Bharosa funds are deposited in farmers’ accounts today

ఈ సందర్భంగా పుట్టపర్తి బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌… వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం జగన్‌. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ పథకం కింద వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి రూ. 4,000 చొప్పున ఆర్ధిక సహాయం చేయనున్నారు. దీంతో 53.53 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. ఈ సందర్భంగా రూ.2,204.77 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news