ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవు – సజ్జల

-

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేంద్రం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ స్పష్టంగానే ఉందని..అమరావతే ఏకైక రాజధాని అని అందులో ఎక్కడా లేదని తెలిపారు. కానీ ఎల్లో మీడియా ఏదేదో హడావుడి చేస్తున్నారని..దానికి పరాకాష్టగా చంద్రబాబు కూడా మాట్లాడారని ఆగ్రహించారు. మతి చలించిన వ్యక్తిలాగ చంద్రబాబు మాటలు ఉన్నాయి….అమరావతిలో భూములపై కన్నేసిన బ్రోకరులాగ చంద్రబాబు వ్యవహారశైలి ఉందని నిప్పులు చెరిగారు.

తన కోటరీకి మళ్ళీ ఆశలు కల్పించేలా బాబు మాటలు ఉన్నాయి…గతంలో ఇజ్రాయిల్ నుండి ట్యాపింగ్ పరికరాలు తెచ్చి మా ఫోన్లు ట్యాపింగ్ చేశారని తెలిపారు.మేము ఆధారాలతో సహా బయట పెట్టామని..అసెంబ్లీలో మాట్లాడిన మొత్తం వీడియో చూపకుండా కట్ చేసి చంద్రబాబు చూపించారని గుర్తు చేశారు.

ప్రభుత్వ భూమి ఉన్న చోట రాజధాని ఉండాలని జగన్ ఆనాడు చెప్పారు…శివరామకృష్ణన్ కమిటీ వేసిన రిపోర్టులో ఉన్నట్టు చంద్రబాబు పని చేశారా? అని నిలదీశారు.రాజధానిని అమరావతిలో పెట్టమని శివరామకృష్ణన్ కమిటీ చెప్పలేదు…వికేంద్రీకరణ చేయాలని శివరామకృష్ణ చెప్పారన్నారు. కానీ దాన్ని పక్కన పెట్టి నారాయణ కమిటీ వేసి, అమరావతిని ఎంపిక చేశారు…మూడు పంటలు పండే‌ ప్రాంతంలో రాజధాని వద్దని శివరామకృష్ణ చెప్పారని సజ్జల తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news