పవన్ తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది : సజ్జల

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ మీడియాతో పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా టీడీపీ బలహీన పడిందని పవన్ చెబుతున్నారు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చానని పవన్ చెబుతున్నారు. 175 సీట్లలో పవన్ కళ్యాణ్ పార్టీ ఎన్నిసీట్లలో పోటీ చేస్తుందనేది చూడాలి.  బలహీన పడిన టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తారో పవన్ కళ్యాణ్ చెప్పాలి. లేదా టీడీపీ నాయకులు జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారో వెల్లడించాలి. 

అదేవిధంగా పెడనలో పవన్ 3 అశాల గురించి మాట్లాడారు. టీడీపీ బలహీన పడింది. టీడీపీకి యువరక్తం ఎక్కిస్తాం. ఎన్డీఏ నుంచి బయటికి వస్తామని చెప్పారు. మరోవైపు ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు కేసులతో సంబంధం లేదన్నారు. ప్రాథమిక ఆధారాలతో కోర్టు చంద్రబాబును జైలులో పెట్టింది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. జగన్ ఢిల్లీ టూర్ పై టీడీపీ ఎప్పుడూ తప్పుడు ప్రచారమే చేస్తుందని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు స్కామ్ లో  లోకేష్ సన్నిహితుడు కిలార్ పాత్ర కీలక పాత్ర ఉందని వెల్లడించారు సజ్జల. స్కిల్ స్కామ్ కేసులో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news