సంచలనం, నాటుసారాలో శానిటైజర్ కలుపుకుని తాగారు…!

-

ప్రకాశం జిల్లా కురిచేడులో నాటు సారా తాగి… 10 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. వారు అందరూ యాచకులు అని పోలీసులు చెప్తున్నారు. లాక్ డౌన్ ఉండటంతో అక్కడ మద్యం షాపులు క్లోజ్ చేసి ఉంచారు. దీనితో మద్యం దొరకక శానిటైజర్ తాగారు. ఈ ఘటనలో నిన్న సాయంత్రం నుంచి పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన వారంతా రోజు శానిటేజర్ సేవించడంతో పాటు రాత్రి నాటు సారా పూటుగా సేవించారు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కురిచేడు సమీపంలో చెన్నారెడ్డి కాలనీలో నాటుసార తయారు చేస్తున్నారు అని గుర్తించారు. వారు నిన్న శానిటేజర్ తాగడంతో పాటుగా… నాటు సారా లో శానిటైజర్ కలుపుని తాగారు అని గుర్తించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ సిద్దార్థ కౌశల్ సందర్శించారు

Read more RELATED
Recommended to you

Latest news