నా పిల్లల మీద ఒట్టు.. చంద్రబాబు నాతో మాట్లాడించలేదు : బుద్దా వెంకన్న

-

ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయి పలు విషయాల గురించి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేశినేని నాని మాటలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. తాజాగా బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. కేశినేని నానికి నోటి దూళ అని.. ఎవ్వరినీ పడితే వాళ్లను తిడతాడని చెప్పాడు.

నా మనవళ్ల మీద ఒట్టు.. చంద్రబాబు నాయుడు నాతో తిట్టించలేదు అని ప్రమాణం చేశాడు బుద్దా వెంకన్న. నువ్వు కూడా నీ కూతురు మీద ఒట్టేసి ప్రమాణం చేస్తావా అని ప్రశ్నించారు.  కేశినేని నాని.. నువ్వేంది.. నీ స్థాయి ఏంటి అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. నువ్వు సొంతంగా గెలిచావా..? నువ్వు గెలిస్తే బుద్దా భవన్ ఇచ్చేస్తా.. నువ్వు ఓడిపోతే కేశినేని భవన్ ఇస్తావా అని ప్రశ్నించారు. నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు పట్టదు. కేశినేని నాని వైసీపీ కోవర్టు. సొంత తమ్మడి భార్యపై ఎవరైనా కేసులు పెడతారా..? కేశినేని చిన్ని భార్య పై చంద్రబాబు కేసులు పెట్టమన్నారా..? అని ప్రశ్నించారు. నువ్వు నిజాయితీ పరుడివి.. విజయవాడకు కాపలాదారుడివా..?

60 శాతం ఖాళీ చేస్తారా..? నీ రాజకీయ భవిష్యత్ గురించి చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావా..? కేశినేని నానికి, చిన్నికి ఎప్పటి నుంచో గొడవలున్నాయి. చంద్రబాబు మోసగాడా..? చిన్న ఆట ఆడుకుందాం.. బీసీలు సంపాదిస్తే అక్రమార్జన.. నువ్వు సంపాదిస్తే సక్రమార్జననా..? టీడీపీ జెండా ఉన్నంత వరకే మనకు విలువ ఉంటుంది. చంద్రబాబు ఆరోజే సస్పెండ్ చేసి ఉంటే.. ఇక్కడివరకు వచ్చేది కాదన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు పార్టీ కోసం ఏనాడు అయినా మాట్లాడావా..? విజయసాయిరెడ్డితో కాంట్రాక్టులో ఉండేవాడివి. 

Read more RELATED
Recommended to you

Latest news