నా ముందు లోకేష్ ఓ ఆప్ట్రాల్ : కేశినేని నాని

-

టీడీపీ నేత నారా లోకేష్ ఏ అర్హతతో యువగళం పాదయాత్ర చేశారని ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు.  ఇవాళ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయిన తరువాత కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పేరు వాడుకొని లోకేష్ రాజకీయాలు చేస్తున్నారు. లోకేష్ ఆప్ట్రాల్ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి. పార్టీ కోసం లోకేష్ ఏమైనా సొంత ఆస్తులు అమ్మారా..? పాదయాత్ర చేసేందుకు లోకేష్ కి ఏం హక్కు ఉంది..? ఓడిపోయిన వ్యక్తి పాదయాత్రలో ఎంపీగా ఉన్న నేను. జీ హుజూర్ అనాలా..? నేనెవ్వరికీ భయపడను అని నాని ధ్వజమెత్తారు.

చంద్రబాబుపై ధ్వజమెత్తారు. నా కుటుంబ సభ్యులతో కొట్టించాలని లోకేష్ ఎందుకు చూశాడు..? నేనేం తప్పు చేశాను? నన్ను చెప్పుతో కొడతానని ఓ క్యారెక్టర్ లెస్ వ్యక్తి మాట్లాడినా పార్టీ ఎందుకు స్పందించలేదు. టీడీపీలో ఉంటూ ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి . అని నాని ప్రశ్నించారు. చంద్రబాబే సొంత పార్టీ నేతలతో తనను తిట్టించారని.. చంద్రబాబు పచ్చి మోసగాడు అని విమర్శించారు కేశినేని నాని. టీడీపీ కోసం రూ.2వేల కోట్ల ఆస్తులు అమ్ముకున్నానని ఎంపీ కేశినేని నాని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news