తిరుమలలో హై అలెర్ట్..ప్రకటించారు. జమ్మూకాశ్మీర్లో పర్యటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం అలర్ట్ ఐంది. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలోను పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసింది సెక్యూరిటీ సిబ్బంది.

తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రత సిబ్బంది అలర్ట్ చేసింది. అనుమానితులను విచారిస్తూ, వారి వివరాలను సేకరిస్తోంది సెక్యూరిటీ సిబ్బంది. కాగా తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇవాళ దర్శనాలకు 12 గంటల సాయం పడుతోంది. తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు సుమారు 12 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. 9 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
తిరుమలలో హై అలెర్ట్..!
జమ్మూకాశ్మీర్లో పర్యటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం
ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం అలర్ట్
అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలోను పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను,… pic.twitter.com/njxfaNFred
— Telugu Scribe (@TeluguScribe) April 24, 2025