టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో సంచలన విషయాలు… ఒక్కో కత్తి పోటుకు రూ. 2 లక్షలు..!

-

టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. వీరయ్య చౌదరి ఒళ్లంతా కత్తులతో తూట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయన బాడీపై 53 కత్తిపొట్లు గుర్తించారు. ఒక్కో కత్తిపోటుకు రూ.2 లక్షలు ? నిందితుడు తీసుకున్నాడని అంటున్నారు. సూత్రధారులు, పాత్రధారుల మధ్య ఒక్కో కత్తిపోటుకు రూ.2 లక్షలు ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు.

Sensational details in the murder case of TDP leader Veeraiah Chowdhury

అందుకే వీరయ్య ఒళ్లంతా జల్లెడ చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. వీరయ్య హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. వీరయ్యను చంపేందుకు 3 నెలల కిందటే నిందితుల ప్లాన్ వేశారని అంటున్నారు. హత్య జరిగి వారం రోజులు అవుతున్నా దొరకని నిందితులు.. పరారీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news