రాజన్న వారసులం అని ఎలా చెప్పుకుంటావ్‌? – వైఎస్‌ షర్మిల

-

రాజన్న వారసులం అని ఎలా చెప్పుకుంటావ్‌? అంటూ సీఎం జగన్‌ ను వైఎస్‌ షర్మిల నిలదీశారు. మీ ఇంటికి, మీ గ్రామానికి మేలు చేస్తేనే ఓటు వెయ్యండి అని అడిగేవాళ్లకు ఈ వార్త చూసైనా కనువిప్పు కలగాలని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని అట్టకెక్కించడంతో ఆసుపత్రిలో సరైన వైద్యం ఎలాగూ అందటంలేదని ఫైర్‌ అయ్యారు షర్మిల.

కనీసం చనిపోయిన మృతదేహాన్ని కూడా ఇంటికి చేర్చుకోలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారంటే అధికార పార్టీ సిగ్గుపడాలంటూ ఫైర్‌ అయ్యారు. మేము అదిచేసాం ఇది చేసాం అని డబ్బాలు కొట్టుకోవటం కాదు పేదోడి కనీస అవసరాలు తీర్చలేని మీ ప్రభుత్వం ఎందుకు? అంటూ నిలదీశారు. మళ్లీ మీరు రాజన్న వారసులం అని చెప్పుకుంటారు? ఇలానే ఉంటుందా రాజన్న పాలనా? అందుకే చెబుతున్నాం ఓటు అనే ఆయుధంతో వీళ్లకు బుద్ది చెప్పండన్నారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news