ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ?

-

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వైయస్ షర్మిలకు పెద్ద పోస్టు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా వైఎస్ షర్మిలను నియమించేందుకు కసరత్తు చేస్తోంది అధిష్టానం.

Sharmila as the President of Andhra Pradesh Congress

దీనిపై మరి కొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన కూడా చేయనుందట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి ఈ నిర్ణయం పై త్వరగా చర్చిస్తోంది కాంగ్రెస్ పార్టీ.

అటు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా పని చేసేందుకు షర్మిల కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తానని షర్మిల చెబుతున్నారట. మరి ఏపీలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news