వినుకొండలో జై జగన్ అంటూ నినాదాలు !

-

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తున్న సందర్భంగా చిలకలూరిపేట నర్సాపేట సెంటర్లో జగన్ కాన్వాయ్ రావడంతో హైవేపై పార్టీ శ్రేణులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కారులోనే ఉండి జగన్ వారికి అభివాదం చేశారు.

Slogans saying Jai Jagan in Vinukonda

 

ఇది ఇలా ఉండగా, వర్షాలు కురుస్తునందున రోడ్డు మార్గాన వినుకొండ బయలుదేరారు జగన్. అయితే.. ఈ తరుణంలోనే… వై ఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. వై ఎస్ జగన్ తో పాటు వినుకొండ బయలుదేరారు మాజీ మంత్రులు, ఎంపీలు,.ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు. ఎక్కడికక్కడ నేతల కార్లు వై ఎస్ జగన్ వెంట వెళ్లకుండా నియంత్రిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version