BJP పార్టీపై అలిగిన సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి ?

-

ఏపీలో బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు సిద్దార్ద్ నాధ్ సింగ్, అరుణ్ సింగ్ హాజరయ్యారు. అలాగే… ఈ సమావేశానికి ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు హాజరు అయ్యారు. అయితే….బీజీపీ పదాధికారుల సమావేశానికి టిక్కెట్లు దక్కని సీనియర్ నేతలు రాలేదు. ఈ సమావేశానికి సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఎన్నికల్లో సీట్లు ఆశించి భంగ పడిన ఈ ముగ్గురు నేతలు…బీజేపీపై అలిగారట.

Somu Veerraju, GVL, Vishnuvardhan Reddy sold on BJP party

ఇక ఈ ముఖ్య నేతల గైర్హాజరుపై బీజేపీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడుతూ…టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారన్నారు. మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరమని చెప్పారు. మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమమని పేర్కొన్నారు. ఏపీలోని అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు….పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశావహులకు నిరాశ ఎదురైందన్నారు పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news