వైఎస్ జగన్ పల్నాడు పర్యటనపై ఎస్పీ శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. వైఎస్ జగన్ పల్నాడు పర్యటన ఆంక్షలకు విరుద్ధంగా జరిగిందని పేర్కొన్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు ఎస్పీ శ్రీనివాసరావు. పోలీసులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు.

ట్రాఫిక్ సమస్యలు సృష్టించారని తెలిపారు ఎస్పీ శ్రీనివాసరావు. అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారు… న్యాయ సలహాలు తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ శ్రీనివాసరావు. ఇక అటు నిన్న పోలీసు అధికారులకు మాజీ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామంటూ హెచ్చరించారు జగన్.