తాడిపత్రి రోడ్డు ప్రమాదంలో 4కి చేరిన మృతుల సంఖ్య

-

శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి మండలం రావివెంకటపల్లి లో కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. తాడిపత్రికి చెందిన మోహన్ రెడ్డి ఇటీవల కారు కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా తన స్నేహితులకు నిన్న రాత్రి పార్టీ ఇవ్వగా.. వారు తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మోహన్ రెడ్డి తో పాటు విష్ణువర్ధన్ రెడ్డి, నరేష్ అక్కడికక్కడే మృతి చెందారు.

మరో యువకుడు శ్రీనివాసరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 4కి చేరింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news