BREAKING: చిలకలూరిపేట లో టీడీపి కౌంటింగ్ ఏజెంట్ కు గుండె పోటు

-

BREAKING: ఏపీలో కౌంటింగ్ ప్రారంభం అయింది. ఈ తరుణంలోనే..చిలకలూరిపేట లో టీడీపి కౌంటింగ్ ఏజెంట్ కి గుండె పోటు వచ్చింది. దీంతో టీడీపి కౌంటింగ్ ఏజెంట్ ను ఆస్పత్రికి తరలించారు. ఇక అటు ఏపీలో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు.

అటు అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి కాగా… 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అయింది. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు ఏర్పాటు చేశారు. 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుళ్లు ఏర్పాటు చేశారు.557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news