తెలుగు దేశం పార్టీకి 4 సీట్లే వస్తాయి – విజయసాయి సంచలనం

-

తెలుగు దేశం పార్టీకి 4 సీట్లే వస్తాయంటూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబూ…! పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్‌లో) నీకు వచ్చింది 23 స్థానాలే వచ్చినట్లు పేర్కొన్నారు విజయ సాయిరెడ్డి.

Telugu Desam Party will get only 4 seats sai Vijayasai Sensation

ఈ సారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు అంటూ చురకలు అంటించారు. జూన్‌ 4న కౌంటింగ్ జరగబోతున్నదని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ? అంటూ సెటైర్లు పేల్చారు. ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి…నీ మీద జాలేస్తోందని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news