ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడి అనుమానాస్పద మృతి

-

విదేశీ గడ్డపై మరో భారతీయుడి ప్రాణం రాలింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ వాసి అరటి అరవింద్ యాదవ్ (30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షాద్‌నగర్‌ బీజేపీ నేత అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్ఉ ద్యోగరీత్యా సిడ్నీలో స్థిరపడ్డారు. ఐదు రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సముద్రంలో ఓ యువకుడి శవం లభ్యమైనట్టు స్థానిక పోలీసులు గుర్తించి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా ఆ శవం అరవింద్‌దేనని ధ్రువీకరించారు. అతడిది హత్యా ? లేక ఆత్మహత్యా ?అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే గత సోమవారం స్వదేశానికి వచ్చేందుకు కుటుంబ సభ్యులతో అరవింద్ ఏర్పాట్లు చేసుకున్నారని బంధువులు తెలిపారు. సోమవారం రోజున అరవింద్ కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. కారు వాష్ చేయించుకుని వస్తానని చెప్పిన అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

Read more RELATED
Recommended to you

Latest news