అదుపుతప్పి బోల్తా కొట్టిన కారు.. ఇద్దరు మహిళలు దుర్మరణం

-

అదుపుతప్పి కారు బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు మహిళలు దుర్మరణం పాలవ్వగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో కొండారెడ్డిపాలెం వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మృతులు సామ్రాజ్యం, సులోచనగా గుర్తించారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌ను పోలీసులు వెంటనే క్లియర్ చేశారు. ప్రమాదానికి గురైన కారును జేసీబీ సాయంతో పక్కకు తొలగించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రహదారి భద్రతా నియమ నిబంధనలను తప్పక పాటించాలని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పొలీసులు హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news