దువ్వాడ శ్రీను ముందు 5 డిమాండ్లు పెట్టిన కుటుంబ సభ్యులు !

-

Duvvada Srinu: శ్రీకాకుళం టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్యామిలీ వ్యవహారం ఇంకా రసవత్తరంగా కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్యామిలీ వ్యవహారంలో ఆయన భార్య దువ్వాడ వాణి నిరసన…ఆరవ రోజుకు చేరింది. ఆరు రోజులుగా కార్ షెడ్ లోనే నిద్రి స్తూ నిరసన తెలుపుతున్నారు దువ్వాడ భార్య వాణి , కుమార్తెలు , కుటుంబ స భ్యులు.

ఇక దువ్వాడ భార్య వాణి , కుమార్తె లు , కుటుంబ సభ్యులతో దువ్వాడ శ్రీనివాస్‌ మధ్య గత రాత్రి చర్చలు జరుగగా.. ఆ చర్చలు విఫలం అయ్యాయట. ఇక ఈ రోజు మరోసారి భేటీ కాకున్నారు ఇరు వర్గాల కుటుంబ సభ్యులు. దువ్వాడ వాణి డిమాండ్లపై చర్చించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రధానంగా 5 డిమాండ్లు దువ్వాడ శ్రీనివాస్‌ ముందు ఉంచారట కుటుంబ సభ్యులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక అటు మాధురి యాక్సిడెంట్‌ అయి.. ఆస్పత్రి లో చికిత్స తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news