విజయవాడలో దారుణం.. సైడ్ ఇవ్వలేదని వైసీపీ నేత అనుచరులు ఆటోడ్రైవర్ పై దాడి..!

-

విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని చితకబాదారు వైసీపీ నేత దేవినేని అవినాష్ అనుచరులు. సామాన్యుల పట్ల దేవినేని అనుచరులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని  జనసేన అధికార ప్రతినిధి, విజయవాడ అధ్యక్షులు పోతిన మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం సైడ్ ఇవ్వలేదనే ఓ ఆటో డ్రైవర్ ని పట్టుకొని దేవినేని అవినాష్ అనుచరుడు యుగేందర్ బాబు చితకబాదినట్టు ఆరోపించారు మహేష్.  

ఆటో డ్రైవర్ మోహన్ ని దొడ్లో బంధించి దాడి చేశారని.. కొడుకు కోసం వెళ్లిన తల్లి దుర్గారాణిని కూడా బండ బూతులు తిట్టారని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ దాడి ఘటనపై అవినాష్ బాధ్యుడని మహేష్ ఆరోపించారు. అడ్డు అదుపు లేకుండా అవినాష్, ఆయన అనుచరులు చేస్తున్న రౌడీయిజంపై గతంలోనే విజయవాడ పోలీస్ కమిషనర్ కి చెప్పానని.. అయినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని మహేష్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆటో డ్రైవర్ పై దాడి ఘటనను సీరియస్ గా తీసుకొని అవినాష్ అనుచరులపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.  బాధితుడికి అండగా నిలబడి న్యాయం చేయాలని జనసేన డిమాండ్ చేస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news