గత ప్రభుత్వం నిధులన్ని దారి మళ్లించింది.. అక్రమాలన్ని తేల్చుతాం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

-

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 14, 15 ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి పంచాయతీలను నిర్వీర్యం చేసిందని శాసనమండలి లో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లకు కనీస గౌరవం లేదని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చినా పంచాయతీ ఖాతాలకు వెళ్లలేదని చెప్పారు. పంచాయతీలకు విడుదల చేసిన 9 వేల కోట్ల రూపాయల గ్రాంటును గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ నిధుల మళ్లింపుపై కమిషన్ వేసి అక్రమాలపై నిగ్గు తేలుస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.

వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరుగుతోందని.. పాత్రదారులు, సూత్రదారులు ఎవ్వరినీ వదలిపెట్టమని హెచ్చరించారు.  గత ప్రభుత్వ పాలన కంటే మెరుగ్గా పాలన అందించేందుకు కృషి చేస్తాం. 

Read more RELATED
Recommended to you

Latest news