మీర్‌పేట్లో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం..ఏకంగా తిరుమలలో !

-

మీర్‌పేట్లో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం అయింది. ఏకంగా తిరుమలలో మీర్‌పేట్లో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం అయింది. మీర్ పేట్ లో అదృశ్యమైన బాలుడు క్షేమంగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. తిరుపతిలో ప్రత్యక్షమైన బాలుడు..పోలీసులు చిక్కాడు. మీర్పేట్ నుండి ట్యూషన్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు బాలుడు.

Missing boy found in Meerpet

చివరగా మలక్ పేట్ రైల్వేస్టేషన్లో టికెట్ తీసుకుంటూ సీసీ కెమెరాకు చిక్కాడు బాలుడు. సీసీ కెమెరా ఆధారంగా విచారణ జరిపారు పోలీసులు. మలక్పేట్ లో ట్రైన్ ఎక్కి తిరుపతికి వెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు….తిరుపతి రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలు ఆధారంగా మహిధర్ రెడ్డిని గుర్తించారు. ఇక కుటుంబ సభ్యులను తీసుకొని తిరుపతికి బయలుదేరారు మీర్పేట్ పోలీసులు. అయితే.. ఆ బాలుడు కావాలనే వెళ్లాడా? లేక..ఎవరైనా కిడ్నాప్‌ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనపై ఇంకా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news