షాద్ నగర్ దళిత మహిళా కేసులో మరో ట్విస్ట్..!

-

షాద్ నగర్ దళిత మహిళా కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మేము దళితులమే మాకు ఎవరు న్యాయం చేస్తారు..? అంటూ బంగారం పోయిన బాధితుల గగ్గోలు పెడుతున్నారు. 24 తులాల బంగారం, రెండు లక్షల నగదును సునిత చోరీ చేసిందని… మీ రాజకీయాల కోసం మా కేసును పక్కదారి పట్టించొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు బంగారం పోయిన బాధితులు.

పెళ్లి కోసం దాచుకున్న సొత్తుంతా దోచేశారని… ఇప్పుడు పెళ్లి జరగకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం అంటున్నారు. థర్డ్ డిగ్రీ చేయమని నేను చెప్పలేదు దానికి మేము కూడా వ్యతిరేకమేనని చెప్పారు బంగారం పోయిన బాధితులు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని.. ఎస్సీ కమిషన్ కు మేము దళితులమని తెలియదా..? అని ప్రశ్నించారు. ఊరిలో ఉన్న సునీతను తీసుకొచ్చి ఆసుపత్రిలో పెట్టి ఇదంతా రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రౌడీ షీటర్ గురించి మాట్లాడే నాయకులు సునీత భర్త రౌడీషీటర్ అని మీకు తెలియదా..? మీ రాజకీయ కోసం మమ్మల్ని వాడుకుంటారా అంటూ బంగారం పోయిన బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news