ముద్రగడను కలిసేందుకు వైసీపీ ప్రయత్నించలేదు – తోట త్రిమూర్తులు

-

ముద్రగడను కలిసేందుకు వైసీపీ ప్రయత్నించలేదన్నారు తోట త్రిమూర్తులు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను కలవడానికి ఇష్టపడని ముద్రగడ అంటూ ఓ వార్త వైరల్‌ అవుతోంది. తోట త్రిమూర్తులు ను రావొద్దని వచ్చినా కలవనని పద్మనాభం చెప్పారట.మీకు మాకు సెట్ అవ్వదని ముద్రగడ క్లారిటీ ఇచ్చారట. అయితే.. ఈ వార్తపై తోట త్రిమూర్తులు స్పందించారు.

Thota Trimurthulu about mudragada

ముద్రగడ పద్మనాభంతో సంప్రదింపులు చేయమని నాకు పార్టీ హైకమాండ్ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని..నేను ముద్రగడ పద్మనాభంను కలిసే ప్రయత్నం చేయలేదని వెల్లడించారు. ఈ ప్రచారాలు అన్ని అవాస్తవాలు అని చెప్పారు. నేను మండపేట లో నా ఆఫీసులో ఉన్నానని..ముద్రగడ టీడీపీ చేరుతారు అని నేను భావించటం లేదని పేర్కొన్నారు. ఆ పార్టీలో ముద్రగడకు అన్ని అవమానాలు జరిగిన తర్వాత మళ్ళీ ఆ పార్టీలో చేరతారని నేను నమ్మటం లేదని వివరించారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అన్నారు తోట త్రిమూర్తులు.

Read more RELATED
Recommended to you

Latest news