టీడీపీలో చేరిన ముగ్గురు YCP కార్పొరేటర్లు..!

-

సెంట్రల్ నియోజకవర్గంలోని ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. 29వ డివిజన్ కు చెందిన లక్ష్మీపతి , 61వ డివిజన్ కు చెందిన ఉమ్మడి వెంకట్రావు , 63వ డివిజన్ కు చెందిన గణేష్ ను పసుపు కండువా కప్పి ఆహ్వానించారు ఎంపి‌ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ. అనంతరం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు నమ్ముతున్నారు. వరదల సమయంలో చంద్రబాబు స్పందించిన తీరు అద్భుతం. లక్షల మందికి ప్రభుత్వం తరపున ఆర్ధిక సాయం అందించారు అలాగే నేడు కూటమి ప్రభుత్వం తోనే ప్రజలు కష్టాలు తీరతాయి. వైసిపి నాయకులు కూడా టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు అని ఎంపి కేశినేని చిన్ని అన్నారు.

ఇక బోండా ఉమ మాట్లాడుతూ.. విపత్తును ఎదుర్కొని ప్రజలను కాపాడిన చంద్రబాబు సేవలు ఆదర్శనీయం. వరద బాధితులకు ఆహారం, మంచినీళ్లు, ఇతర సౌకర్యాలు కల్పించారు. గతంలో ఎవరూ ఇవ్వని విధంగా 25 వేలు ,పై అంతస్తులో ఉన్న వారికి పది వేలు ఇచ్చారు. ఇది దేశంలో నే ఒక రికార్డు గా అందరూ చెబుతున్నారు. వరద ప్రాంతాలలో ఈ సేవలు చూసిన వైసిపి నాయకులే చంద్రబాబు సేవలను మెచ్చుకుంటున్నారు. అయితే ప్రజా సేవ పట్ల అంకిత భావం ఉన్న వారినే పార్టీలో చేర్చుకుంటున్నాం అని బోండా ఉమ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news