శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్.. అక్టోబర్​​ కోటా టికెట్ల షెడ్యూల్ రిలీజ్

-

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. అక్టోబర్​ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల బుకింగ్​కు సంబంధించిన షెడ్యూల్​​ ను టీటీడీ రిలీజ్ చేసింది. అక్టోబర్​ నెలకు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లను జులై​ 18వ తేదీన ఉదయం 10 గంట‌ల‌కు ఆన్​లైన్​లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.  ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జులై​ 18వ తేదీ ఉదయం 10 నుంచి జులై​ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చని తెలిపింది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు జులై 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని సూచించింది.

మరోవైపు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను జులై 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.  వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను అదే రోజు (జులై 22) మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్​ చేయనున్నట్లు వెల్లడించింది. ఇక అక్టోబర్​ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ఆన్​లైన్​లో టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news