జొమాటో & స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ ఫీజులు పెంపు

-

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌లైన జొమాటో, స్విగ్గీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ ప్లాట్‌ఫామ్‌ ఫీజును 20 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. దిల్లీ, బెంగళూరు లాంటి బాగా డిమాండ్‌ ఉన్న నగరాల్లో, ఇకపై ప్లాట్​ఫామ్ ఫీజుగా రూ.6 వసూలు చేయనున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటి వరకూ ఈ ఫీజు రూ.5గా ఉండగా..  స్విగ్గీ బెంగళూరులో తమ ప్లాట్‌ఫామ్‌ ఫీజును రూ.7గా పేర్కొంది. రాయితీ తర్వాత దాన్ని రూ.6కు తగ్గించినట్లు తెలిపింది.

2023లో రూ.2తో దీన్ని ప్రారంభించిన ఈ సంస్థలు క్రమంగా పెంచుతూ వచ్చాయి. ఏప్రిల్‌లో జొమాటో తన ప్లాట్​ఫామ్ ఫీజును 25 శాతం పెంచి రూ.5 చేసింది. దిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు, ముంబయి, లఖ్‌నవూ నగరాలకు ఈ పెంపును వర్తింపజేసింది.  ఒక్కో ఆర్డర్‌పై పొందే ఆదాయాన్ని, మరింత పెంచుకోవడం కోసం ఫుడ్‌ డెలివరీ యాప్‌లు ఈ ప్లాట్​ఫామ్​ ఫీజును ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం మార్కెట్‌లో జొమాటో, స్విగ్గీలదే పైచేయిగా ఉంది. ఈ నేపథ్యంలోనే క్రమపద్ధతిలో ఫీజును పెంచుతూ, మార్కెట్‌ వర్గాల స్పందనను పసిగడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news