శ్రీవారి భక్తులకు TTD శుభవార్త.. 4.23 లక్షల టోకెన్ల రిలీజ్‌ !

-

 

తిరుమల శ్రీవారి భక్తులకు TTD శుభవార్త అందింది. తిరుమల శ్రీవారి భక్తులు క్యూలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువసేపు వేచి ఉండటాన్ని నివారించేందుకు ఈనెల 22 నుంచి టైం స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Notification for 56 posts in TTD
TTD

తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాల్లో 94 కౌంటర్ల ద్వారా 4.23 లక్షల టోకెన్లను భక్తులకు అందజేస్తామన్నారు. ఈ నెల 23 నుంచి వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం రద్దు చేస్తున్నట్లు చెప్పారు.

కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.తిరుమల శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా తిరుమల శ్రీవారి దర్శనం జరుగుతోంది. ఇక నిన్న తిరుమల శ్రీవారిని 56,950 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారికి 20,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.75 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news