బ్రేకింగ్ : తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. ఎప్పుడంటే ?

-

తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలకు ఎన్నికల సంఘం శేద్యియిల్ ప్రకటించక ముందే పదును పెట్టాయి ప్రధాన రాజకీయ పార్టీలు. టీడీపీ అయితే ఒక అడుగు ముందే తమ అభ్యర్ధిని కూడా ప్రకటించింది. సిట్టింగ్ స్థానం కావడంతో వెంటనే వైసీపీ కూడా తమ అభ్యర్థి పై క్లారిటీ ఇచ్చేసింది. ఎన్నికల తర్వాత కొత్త పొత్తుకు తెర తీసిన బీజేపీ,జనసేనలు లేక్కలేసుకుని బీజేపీ పోటీ చేస్తున్నట్టు ప్రకటించాయి.

ఇక ఎట్టకేలకు తిరుపతి ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మార్చి 23 వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 30వ తేదీ వరకు నామినేషన్లకు తుది గడువు ఇవ్వనున్నారు. ఇక వైసీపీ, బీజేపీలు అధికారికంగా తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news