ఖాజా టోల్‌ప్లాజా వద్ద 2 కి.మీ. మేర నిలిచిన వాహనాలు

-

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రముఖులతో పాటు భారీ ఎత్తున సామాన్యులు తరలివస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నారు. దీంతో గుంటూరు జిల్లాలోని కాజా టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ ప్లాజా వద్ద 2 కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు నిలిచాయి. అధికసంఖ్యలో జనం రావడంతో విజయవాడ-గన్నవరం రహదారి రద్దీగా మారింది.

అంతర్గత రహదారుల నుంచి హైవే పైకి వచ్చే మార్గాల్లో భారీగా వాహనాలు ఉన్నాయి. పెద్దఎత్తున తరలిరావడంతో టోల్‌ రుసుం కోసం సిబ్బంది వాహనాలు నిలిపేవేయడంతో కనకదుర్గ వారధిపై వందలాదిగా వాహనాలు నిలిచిపోయాయి.ట్రాఫిక్‌ జామ్‌ వల్ల ప్రమాణస్వీకారానికి వచ్చేందుకు కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సభా ప్రాంగణం వద్దకు ఉదయాన్నే వేలాదిగా టీడీపీ శ్రేణులు పోటెత్తారు. పాస్‌లు తీసుకుని చించేసి పంపడంతో ఎక్కడ కూర్చోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పాస్‌లు లేవంటూ కొంతమంది కార్యకర్తలను పోలీసులు పంపించేస్తుండటంతో నిరాశగా వారు వెనుదిరుగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news