తెలంగాణ మంత్రులకు కొత్త వాహనాలు !

-

తెలంగాణ మంత్రులకు కొత్త వాహనాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా పలువురు మంత్రులకు ల్యాండ్ క్రూజర్లు అందజేసారూ సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల విజయవాడలో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ధిన అనంతరం మంత్రులకు వాహనాల కేటాయించింది ప్రోటోకాల్ డిపార్ట్మెంట్. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

New vehicles for Telangana ministers

కారు కూడా కొనుక్కొలేని పొంగులేటి లాంటి బీద మంత్రులకు కొత్త ల్యాండ్ క్రూజర్ కార్లు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఫైర్ అవుతున్నారు. మంత్రులందరికీ ఒక్కో ల్యాండ్ క్రూజర్స్ వాహనాన్ని కేటాయింపు చేయడం పై తెలంగాణ ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎంకు మాత్రమే ల్యాండ్ క్రూజర్ వాహనాలు ఉండేవి. ఇకపై మంత్రులకు కూడా ల్యాండ్ క్రూజర్ వాహనాలను సమకూర్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒకవైపు ఆర్థిక పరిస్తితి ఇబ్బందులు అంటూనే మరో వైపు కొత్త వాహనాలను ఇచ్చింది రేవంత్ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news