శ్రీవారు దివ్య శక్తితో ఉంటారు..డ్రోన్లు వదలడం దోషం – TTD ప్రధాన అర్చకులు

-

తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ విడియో పై స్పందించారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు. తిరుమల శ్రీవారి ఆలయం మహిమాన్విత శక్తి అని.. వైకుంఠంలోని క్రీడాద్రి పర్వతాలే తిరుమల క్షేత్ర పర్వతాలు అని తెలిపారు. ఆలయంలో శ్రీవారు దివ్య శక్తితో ఉంటారు..శ్రీవారి ఆలయంపై విమానాలు ప్రయాణించడం దోషమన్నారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు.

పవిత్రమైన ఆలయంపై విమానాలు ప్రయాణించ కూడదని ఆగమ శాస్త్రంలో నియమం ఉంది..విమానాలు తిరుమలలో తిరిగికూడదని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నియమనిబంధనలు అతిక్రమించి డ్రోన్ ద్వారా శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించారు అని తెలిసిందని వెల్లడించారు. డ్రోన్ విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..దీనిపై అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news