వైసీపీ నేత సుబ్బరాయుడు హత్యలో ట్విస్ట్..ఆ అధికారులపై వేటు

-

Twist in YCP leader Subbarayadu’s murder: మహానంది (మం) సీతారాంపురం గ్రామంలో జరిగిన వైఎస్ఆర్సిపి నేత పసుపుల సుబ్బరాయుడు హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మహానంది (మం) సీతారాంపురం గ్రామంలో వైఎస్ఆర్సిపి నేత పసుపుల సుబ్బరాయుడు హత్యపై సీరియస్ గా స్పందించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.

Twist in YCP leader Subbarayadu’s murder

ఈ కేసులో రూరల్ ఎస్ఐ శివ కుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ లపై వేటు వేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు డీఐజీ కోయ ప్రవీణ్. ఈ నెల 3 తేదీ అర్ధరాత్రి ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ సమక్షంలోనే సుబ్బరాయుడు దారుణ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఎస్సై, పోలీసులు నిర్లక్ష్యం గా వహించారని సస్పెండ్ చేశారు డిఐజి కోయ ప్రవీణ్. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మరి దీనిపై వైసీపీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version