అమరావతిలో రెండు ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణం..!

-

2025 నుంచి అమలులోకి రానున్న నూతన టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతోంది. నూతన విధానంలో పీపీపీకి ప్రాధాన్యత ఇస్తున్నాం అని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒబరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో 5 స్టార్ హోటళ్లు నిర్మాణం కోసం ముందుకు వచ్చారు. రాజధాని అమరావతిలో రెండు ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణం జరగనుంది అని పేర్కొన్నారు.

అలాగే అమరావతిలో రివర్ ఫ్రంట్ లో టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి జరుగుతుంది. త్వరలోనే కాన్ క్లేవ్ నిర్వహిస్తాం. పర్యావరణ హితమైన, అభివృద్ధి నమూనాగా కొత్త పాలసీ ఉంటుంది. స్వదేశీ దర్శన్, ప్రసాద్ స్కీం రాష్ట్రంలో అమలు చేస్తాం. గత ప్రభుత్వం లో టూరిజం మంత్రులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను తిట్టడం కోసం సమయం వెచ్చించారు తప్ప నిర్మాణాత్మక కృషి చెయ్యలేదు. రాష్ట్రంలో ఇంటిగ్రే టెడ్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నాం. టెంపుల్ టూరిజం 90 శాతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది అని మంత్రి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news