విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు – కేంద్ర మంత్రి

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కొనుగోలు చేసేంత పెద్ద సంస్థలు ప్రస్తుతం కనిపించడం లేదన్నారు.

Union Minister G Kishan Reddy to launch 10th round of commercial coal auctions on Friday

తెలంగాణ గనుల వేలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ సంస్థ పాల్గొని క్యాప్టివ్ మైన్స్ కూడా సొంతం చేసుకోవచ్చు అని వెల్లడించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే అధిక ఇంధన ధరలు, అధిక ద్రవ్యోల్భణం, సామాన్య ప్రజలపై భారం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కర్నాటకలో ఇంధన ధరలపై పన్ను పెంచడంపై కిషన్ రెడ్డి స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news