శ్రీకాకుళం జిల్లాకు అయిల్ రిపనరీ : రామ్మోహాన్ నాయుడు

-

టీడీపీకి కంచుకొటగా శ్రీకాకుళం జిల్లా ఉంది. శ్రీకాకుళం జిల్లాలొ ఒక ఎయిర్ పొర్ట్ పుర్తి చేయాలను‌కుంటున్నాం అని కేంద్ర మంత్రి రామ్మోహాన్ నాయుడు అన్నారు. ములపేట పొర్టు పూర్తి చేసి సంవత్సర కాలంలో షిప్ వచ్చెలా చేస్తాం. శ్రీకాకుళం జిల్లాకు అయిల్ రిపనరీ లేదా పార్మాహాబ్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తెలుగు ప్రజలకు మంచి సేవ చేసే అవకాశం టిడిపి‌ద్వాతా మాకు‌ దక్కింది. వెనుకబడ్డ వర్గాలకు గౌర , గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం టీడీపీ, ఎన్టీఆర్. బిసిలకు సమాజికంగా, అర్దికంగా, రాజకీయంగా అండగా నిలబడింది.

స్కాలర్ షిప్ , డిజిటలైజేషన్ వంటి కార్యక్రమాలు చెపడుతున్నాం. చరిత్రలో ఎన్నడు లేని మెజార్టితో గెలుపొందామంటే కారణం టిడిపి కార్యకర్తలదే. కార్యకర్తలకు పార్టీ అన్ని‌విధాల అండగా ఉంటుంది. జిల్లా పార్టీ సబ్యత్వ నమోదుకు ప్రజలు ముందుకు రావాలి. టీడీపీ కార్యకర్తల పార్టీ. కార్యకర్తల కష్టాలకు‌ అనుగుణంగా స్పందిస్తుంది పార్టీ. రాష్ట్ర అభివృద్దిని కొరుకుంటున్న ప్రతి ఒక్కరు టిడిపి సబ్యత్వం తీసుకునేందుకు ముందుకు రావాలి. అమరావతి రైల్వే లైన్ ఇచ్చాం. రణస్దలం వద్ద హైవే లో ఎలివేటెడ్ వంతెనకు నిధులు మంజురు చేసాం. నరసన్నపేట నుంచి‌ ఇచ్చాపురం వరకూ 4 లైన్ల రహాదారి నియమిస్తాం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news