మంత్రి రోజా తన గొయ్యి తనే తవ్వుకుంటోంది : వంగలపూడి అనిత

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను తట్టుకోలేక 150 మందికి పైగా మరణించారని వెల్లడించారు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఇవాళ ఆమె నారావారి పల్లెలో మీడియాతో మాట్లాడారు. వీరిని కలిసి అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారని తెలిపారు. ఏ మహిళా కూడా దీనిని విమర్శించదని అన్నారు. మంత్రి రోజా దేవుడి సన్నిధి అని కూడా భావించకుండా భువనేశ్వరినీ విమర్శించిందన్నారు. రోజాతన గొయ్యి తనే తవ్వుకుంటుందని అనిత విమర్శలు గుప్పించారు.

ఇదే రోజా భువనేశ్వరి కాళ్లకు నమస్కారాలు పెట్టిన రెండుసార్లు టీడీపీ టిక్కెట్ దక్కించుకొని.. ఇలా మాట్లాడితే మా మాజీ మంత్రి బండారు విమర్శించారన్నారు. వెంటనే చెన్నైకి వెళ్లి బ్రతిమలాడి పాత హీరోయిన్లు చేత వీడియోలు పెట్టించుకుందన్నారు. నగరి నియోజకవర్గంలో ఎర్రమట్టి తరలింపుపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. నగరిలో చికెన్ కొట్టు వ్యాపారుల దగ్గర కూడా చిల్లర తీసుకుంటుందని ఆయన అన్నారు. శ్రీవారి టికెట్లను రోజా అమ్ముకుంటుందని.. చారిటబుల్ ట్రస్ట్ పేరిట మంత్రి రోజా చేతివాటం ట్రస్ట్ నడుపుతుందన్నారు. లోకేష్, పవన్ ఒకే ప్రేమ్ లో కనిపిస్తేనే భయపడుతున్నారని.. వారిద్దరూ సీన్ లోకి దిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి అని వ్యాఖ్యానించారు అనిత.

Read more RELATED
Recommended to you

Latest news