పవన్‌ డైలాగులన్నీ.. త్రివిక్రమ్ రాసిచ్చినవే : వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు

-

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ సినిమాలో గబ్బర్ సింగ్ యే కానీ నిజ జీవితంలో రబ్బర్ సింగ్ అంటూ చురకలంటించారు. ఏదో పీకేస్తాం అని డబ్బా డైలాగు చెబుతున్నావు… ఆయనకు అంత దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ త్రివిక్రమ్ రాసిన డైలాగులు అంటూ ఫైర్ అయ్యారు.

చంద్రబాబు హయాంలో 45 దేవాలయాలు స్కూల్ చేస్తే ఏం చేశారని… పుష్కరాల్లో 30 మంది చనిపోయిన చంద్రబాబుని ఎందుకు నిలదీయలేదు అని పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నువ్వు నమ్ముకో వద్దని జనసేన కార్యకర్తలకు సూచించారు.

2024 ఎన్నికలకు చంద్రబాబుతో కలిసి ఉంటారనే విషయాన్ని చెప్పేందుకు ఆవిర్భావ సభ నిర్వహించాలని చురకలంటించారు. వికేంద్రీకరణ లక్ష్యమని సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలని.. అందుకే 151 సీట్లు సంపాదించారని పేర్కొన్నారు. ఫామ్ హౌస్ లో పుస్తకం చదవకుండా.. అసలు ఏపీలో ఏం జరుగుతుందో చూడాలని పవన్ కు చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news